Sunday, May 19, 2024

Karnataka – మేనిఫెస్టోలో ఇచ్చిన అయిదు హామీల జీ ఓ లపై సిద్దు తొలి సంతకం

బెంగళూరు – కర్నాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలి మంత్రివర్గ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై మాట నిలుపుకొన్నారు. విధాన సౌధలో మధ్యాహ్నం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఐదు హామీల అమలుకు సంబంధించి ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. , తమ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిన ఐదు హామీల్లో ‘గృహజ్యోతి’ పథకం కింద గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తారు.

‘గృహలక్షి పథకం’ కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు రూ.2,000 నెలసరి సాయం.

‘అన్న భాగ్య’ పథకం కింద బీపీఎల్ హౌస్‌హోల్డ్ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 కేజీల ఉచిత బియ్యం సరఫరా.

- Advertisement -

‘యువ నిధి’ పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, డిప్లమో హోల్డర్లకు రూ.1.500 చొప్పున నెలసరి భృతి అందిస్తారు

ఉచిత ప్రయాణం’ పథకం కింద రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement