Friday, May 10, 2024

Big Breaking | వరంగల్​ జిల్లాలో పిడుగుపాటు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

వరంగల్ జిల్లాలో ఇవ్వాల పిడుగుపడింది. నర్సంపేట మండలంలో పిడుగు పడి ఒకరు మృతి చెందగా, నలుగురుకి గాయాలు అయ్యాయి. మండలంలోని భోజ్య నాయక్ తండాలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో పిడుగు పడి బానోత్ సుమన్ చనిపోయాడు. బానోత్ భద్రు, అజ్మీరా శశిరేఖకు గాయాలయ్యాయి.

మహేశ్వరం గ్రామానికి చెందిన లోడెం లింగయ్య రాములు నాయక్ తండా పరిధిలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడి గాయాలయ్యాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. భాధితులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఇక.. వరంగల్​ సిటీలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈ వర్షానికి పలు చోట్ల ఇంటి పైకప్పుతో సహా ప్రవారిగోడలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 14వ వార్డులో ఓ ఇంటి పైకప్పు కూలడంతో అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement