Wednesday, May 1, 2024

ఎలోర్డా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ కప్ ఫైనల్లోకి కళైవాణి శ్రీనివాసన్‌..

నుర్‌-సుల్తాన్‌(కజకస్తాన్‌): ఎలోర్డా కప్‌ టోర్నమెంట్‌లో ఇండియన్‌ బాక్సర్‌ కళైవాణి శ్రీనివాసన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారంనాడిక్కడ జరిగిన సెమీస్‌ (48కేజీల విభాగం)లో ఉజ్బెకిస్తాన్‌ బాక్సర్‌ ఫర్జోనా ఫొజిలొవాపై కళైవాణి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చెన్నై బాక్సర్‌ పవర్‌ఫుల్‌ పంచ్‌లతో దాడి చేస్తూ, ప్రత్యర్థిపై అటాక్‌ మోడ్‌లో విరుచుకుపడింది. దీంతో సునాయాసంగా విజయం సాధించింది. ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సోమవారంనాడు ఫైనల్‌లో కళైవాణి శ్రీనివాసన్‌ తలపడనుంది.

ఇక పురుషుల విభాగంలో ఇండియన్‌ బాక్సర్‌ కుల్‌దీప్‌ కుమార్‌ నాల్గో రౌండ్‌లో కజకస్తాన్‌ బాక్సర్‌ కైరత్‌ యెర్నూర్‌ నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్నారు. అయితే ప్రత్యర్థిపై ఎదురుదాడి ప్రారంభించి, 3-2తేడాతో విజయం నమోదు చేసుకున్నాడు. దీంతో కుల్‌దీప్‌కుమార్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. మరో బాక్సర్‌ యశ్‌పాల్‌ మాత్రం 71 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌లో కజకస్తాన్‌ బాక్సర్‌ అస్లాన్‌బెక్‌ సింబెర్జ్‌నోవ్‌ చేతిలో 5-0తేడాతో ఓటమిని చవిచూశాడు. ఉమెన్స్‌ విభాగంలో సెమీస్‌లో బబిత బిస్త్‌ (81కేజీలు), జ్యోతి (52కేజీలు), నీమ (63కేజీలు) విభాగంలో రాణించి రజత పతకాలు చేజిక్కించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement