Sunday, April 28, 2024

Delhi | హిండెన్‌బర్గ్‌పై జేపీసీ వేయాలి.. ప్రధాని సమక్షంలోనే బీఆర్‌ఎస్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో అదానీ అంశాన్ని తేల్చాల్సిందేనంటూ లోక్‌సభలో బీఆర్‌ఎస్ నేతలు పట్టుబట్టారు. బుధవారం ప్రధానమంత్రి మోదీ ప్రసంగాన్ని లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పార్టీ ఎంపీలతో కలిసి అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ప్రధాని మోదీ సిద్ధపడగా, నామా అదానీ అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని, సభలో చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పార్టీ ఎంపీలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement