Sunday, April 28, 2024

రేపు గన్ పార్క్ వద్ద జర్నలిస్టుల మౌనదీక్ష

క్యూ న్యూస్ సీఈవో తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మౌనదీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రశాంతంగా చేపట్టే మౌనదీక్షకు తరలి రావాలని టిజేఎస్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టిజేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు.

సోమవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్ వద్దగల అమరవీరుల స్థూపం వద్ద జరిగే మౌనదీక్షకు పార్టీలకు, సంఘాలకు అతీతంగా అందరూ రావాలని పిలుపునిచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా మీడియాపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించే ప్రతి జర్నలిస్టు, ప్రతి ప్రజాస్వామ్యకవాది స్వచ్ఛందగా తరలి రావాలని, తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు తప్పకుండా భారీ సంఖ్యలో హాజరు కావాలని, మల్లన్నకు అండగా నిలుస్తున్నట్లే.. తెలంగాణలో ఏ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా.. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఎప్పటిలాగే ఇప్పుడు కూడా స్పందిస్తున్నట్లు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కోరుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. కార్మికుల మానవహారం

Advertisement

తాజా వార్తలు

Advertisement