Thursday, April 25, 2024

స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. కార్మికుల మానవహారం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నేతలు మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 10కి.మీల మానవహారం నిర్వహించారు. కార్మికులు చేపట్టిన ఉద్యమం 199 రోజులు పూర్తయిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు. అగనంపూడి నుంచి బీహెచ్‌పీ వరకు పది కిలోమీటర్ల వరకు పది వేలమంది కార్మికులతో మానవహారం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి. లాభాల్లో ఉన్న ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం కావాలనే… నష్టాల బాటలో నడుపుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంతోనే ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.

ఈ వార్త కూడా చదవండిః స్వ‌చ్ఛ భారత్ లో ఆ సిటీ నెంబర్ వన్ః ప్రధాని మోదీ

Advertisement

తాజా వార్తలు

Advertisement