Saturday, April 27, 2024

Telangana | కామారెడ్డి ఆస్ప‌త్రిలో రిఫరల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ప్రారంభం

కామారెడ్డి (ప్రభన్యూస్) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిట‌ల్‌లో ఇవ్వాల రెఫరల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ప్రారంభ‌మ‌య్యింది. వీటిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బుధ‌వారం ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాభారతిలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని 20.65 కోట్ల రుణాల చెక్ లను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement