Friday, April 26, 2024

టీచర్ కు పాజిటివ్… బిక్కు బిక్కుమంటున్న పిల్లలు

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీనితో హుటాహుటిన పాఠశాలలో కరోనా హెల్త్ క్యాంప్ నిర్వహించి 70 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేశారు.

రెండు రోజుల కిందట కరోనా ర్యాపిడ్ పరీక్షలో నెగెటివ్ రాగా, ఆటీపీసీఆర్ పరీక్షలో తెలుగు ఉపాధ్యాయుడికి బుధవారం పాజిటివ్ వచ్చింది. ఉపాధ్యాయుడు హోం ఐసోలేషన్ లో ఉండగా, పాఠశాలలో ఈ రోజు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పాఠశాలలోని 70 మంది విద్యార్థులకు మరియు ఏడుగురు ఉపాధ్యాయులకు, కరోనా పరీక్షలను నిర్వహించారు. కాగా పిల్లలంతా కూడా ఎక్కడ పాజిటివ్ వస్తుందోనని బిక్కు బిక్కుమంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement