Saturday, May 4, 2024

త‌ప్పిన ప్ర‌మాదం-భారీగా పేలుడు ప‌దార్థాలు-నిర్మానుష్య ప్రదేశంలో పేల్చిన అధికారులు

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో జ‌మ్ముక‌శ్మీర్ లోని పుల్వామా త‌హ‌బ్ క్రాసింగ్ వ‌ద్ద పెద్ద మొత్తంలో పేలుడు ప‌దార్థాల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. తహబ్‌ క్రాసింగ్‌ సమీపంలో 25 నుంచి 30 కిలోల బరువున్న ఐఈడీ (మందుపాతర)ని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్మానుష్య ప్రదేశంలో అధికారులు పేల్చివేశారు. పుల్వామా పోలీసులు అందించిన విశ్వనీయ సమాచారం మేరకు తహబ్‌ క్రాసింగ్‌ వద్ద తనిఖీలు నిర్వహించామని.. ఈక్రమంలో సుమారు 30 కిలోల పేలుడు పదార్థాలు లభించాయని కశ్మీర్‌ అదనపు డీజీపీ విజయ్‌ కుమార్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement