Wednesday, April 24, 2024

AP: ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

ఏలూరు జిల్లాలో ఇటీవల వ్యాపారి దుర్గారావును విచారణ నిమిత్తం జంగయ్యగూడెం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఏలూరులో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం విధితమే. ఇందుకు సంబంధించి… ఏలూరు జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులను ఆ రాష్ట్ర డీజీపీ సస్పెన్షన్‌ చేశారు. సెబ్‌ సీఐ శ్రీనివాసరావు, మస్తానయ్య, కానిస్టేబుల్‌ శ్రీహరిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలం పొగుటూరుకు చెందిన బెల్లం వ్యాపారి కొల్లూరు దుర్గారావు ఆత్మహత్యకు కారణమంటూ ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ జరిపిన తరువాత ముగ్గురిని సస్పెన్షన్‌ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సెబ్‌ ఏసీపీ చక్రవర్తికి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement