Thursday, May 16, 2024

ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను… భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత..

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తన భక్తులను ఎలాంటి ఆపదా రానివ్వ‌న‌ని, కంటతడి పెట్టకుండా పూజలు చేయాలని, కోరుకున్నది తప్పక నెరవేరుతుందని భవిష్యవాణి చెప్పారు. గర్భిణులకు, బాలింతలకు ఎటువంటి బాధలు రానివ్వనని అమ్మవారి వాక్కుగా చెప్పారు.

‘ప్రజలు పూజలు మొక్కుబడిగా చేసున్నారు. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా. మీరు నా గుడిలో పూజలు సరిగా జ‌రిపించడం లేదు. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. పూజలు సక్రమంగా, భక్తిశ్రద్ధలతో జరిపించండి. నేను సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నా. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు.. మీకు నచ్చినట్లు మారుస్తారా?. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా. దొంగలు దోచినట్లుగా నా నుంచే మీరు కాజేస్తున్నారు. మీ కళ్లు తెరిపించేందుకే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నా. ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నా. మీరు కొండంత తెచ్చుకుంటున్నా నాకు గోరంతే పెడుతున్నారు. నా విగ్రహ ప్రతిష్ఠను ఏడాదిలోపు నాకు స్థిరంగా చేయండి అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement