Tuesday, May 7, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 9 గంట‌ల స‌మ‌యం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ‌వారిని సర్వదర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 9 గంటల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 73,387 మంది భక్తులు దర్శించుకోగా 33,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement