Sunday, May 12, 2024

నేను ఆంటీ అయితే.. మీరు తాతయ్యేగా..రాజా రవీంద్రకి కౌంటర్ ఇచ్చిన శ్యామల

ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీల మధ్య ఆంటీ అనే పదం తరచుగా వినిపిస్తోంది. కాగా హీరో నవీన్ చంద్ర నటిస్తున్న తాజా చిత్రం తగ్గేదే లే. శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో యాంకర్ శ్యామలను సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఆంటీ అంటూ కామెడీగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఇచ్చిన కౌంటర్‏కు షాకయ్యాడు. తగ్గేదే లే చిత్రానికి రాజా రవీంద్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అంతేకాకుండా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర తన స్పీచ్ ముగిస్తూ శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అనేశాడు. ఇక అక్కడే ఉన్న శ్యామల ఆయన మాటలను చాలా స్పోర్టివ్‏గా తీసుకుంటూ రాజా రవీంద్రకు తన స్టైల్లో కౌంటరిచ్చింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి గారు మంచి చిత్రాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. బాహుబలి వంటి పది సినిమాలను తీయగల సత్తా ఉంది. కానీ మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనాలో కష్టపడి పని చేశాం. అందరికీ వ్యాక్సినేషన్ చేయించి సొంత మనుషుల్లా చూసుకున్నారు. చాలా హ్యాపీగా పని చేశాం. ఇలాంటి సినిమాలు ఆడితే.. ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది’ అని మాట్లాడుతూ.. చివరిలో శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అంటూ ముగించారు. దీంతో తనను ఆంటీ అనడంపై సీరియస్ కాకుండా తెలివిగా సెటైర్ వేసింది శ్యామల. అబ్బా..హా.. అర్రె.. నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే అంటూ కౌంటరిచ్చింది. దీంతో శ్యామల సమాధానానికి అవాక్కయ్యాడు రాజా రవీంద్ర.

Advertisement

తాజా వార్తలు

Advertisement