Wednesday, May 8, 2024

TS | ఉక్రెయిన్‌లో హైదరాబాదీ మృతి.. ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరిన భౌతికకాయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ మృతదేహం తెలంగాణ ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకుంది. నాంపల్లిలోని బజార్ ఘాట్‌కు చెందిన మహ్మద్ ఆసిన్ ఇటీవల యుద్ధంలో మరణించాడు. ఉద్యోగం పేరుతో రష్యా తీసుకెళ్లి మోసపూరితంగా ఉక్రెయిన్ యుద్ధానికి పంపించారని ఆసిన్ బంధువులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆసిన్ మృతదేహం స్వదేశానికి తిరిగి వచ్చేలా ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి చొరవ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శనివారం ఢిల్లీ చేరుకున్న భౌతికకాయాన్ని తెలంగాణ భవన్ అధికారులు ఆసిన్ బంధువులకు అప్పగించి హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement