Thursday, May 9, 2024

వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం.. సిద్ద‌మైప HCA

ICC క్రికెట్ ప్రపంచ కప్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. అయితే, హైదరాబాద్ లో అక్టోబర్ 9, 10 తేదీల్లో రాజీవ్ గాంధీ స్టేడియంలో వ‌రుసుగా రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో భద్రత కల్పించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిమ‌ఘ్న‌మ‌య్యి ఉంది. అక్టోబర్ 9న న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్, అక్టోబర్ 10న శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక ఈ సంద‌ర్భంగా… రాజీవ్‌గాంధీ స్టేడియంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి, వేదికకు కొత్త రూపు ఇవ్వడానికి అధికారులు ఓవర్ టైం పని చేస్తున్నారు. మెగా ఈవెంట్ కోసం స్టాండ్స్‌లోని అన్ని సీట్లను కూడా అలంకరించారు. వేదిక మొత్తాన్ని శుభ్రం చేస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్ కూడా జట్లకు అత్యుత్తమ అవుట్‌ఫీల్డ్, ఆట పరిస్థితులను కల్పించడానికి కృషి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement