Sunday, May 5, 2024

నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు

తెలంగాణ వ్యాప్తంగా జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూ పార్కులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడా తెరచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతించనున్నారు. దీంతో హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ కూడా తిరిగి తెరుచుకోనుంది. ఉదయం 8:30 గంటలకు జూ పార్క్​ను పునఃప్రారంభంకానుంది. అయితే సందర్శనకు వచ్చే వారికి పలు మార్గదర్శకాలను జూ అధికారులు విడుదల చేశారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: నేటి నుంచి పాల ధర పెంపు

Advertisement

తాజా వార్తలు

Advertisement