Friday, May 3, 2024

ఈనెల 12న అభిమానులతో భేటీ కానున్న రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ నెల 12న అభిమానుల‌తో సమావేశం కానున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసే క్ర‌మంలో ర‌జనీకాంత్ అభిమాన సంఘాలకు చెందిన నాయ‌కుల‌ను క‌లిశారు. అనంత‌రం పార్టీ ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. కొద్ది రోజుల‌కే త‌లైవా అనారోగ్యానికి గురి కావ‌డంతో వెంటనే అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రస్తుత ఆరోగ్య ప‌రిస్థితుల కారణంగా ఇక రాజ‌కీయాల‌లోకి రాన‌ని తేల్చి చెప్పారు.

ఇప్పుడు ర‌జ‌నీకాంత్ మ‌రోసారి అభిమానుల‌తో సమావేశం ఏర్పాటు చేయ‌నుండ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇప్ప‌టికే అన్ని జిల్లాల నాయ‌కుల‌కు ఆహ్వానం కూడా పంపినట్లు తెలుస్తోంది‌. మ‌రి ఈ సమావేశంలో ర‌జ‌నీకాంత్ ఏం చెప్తారా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ర‌జ‌నీకాంత్ వైద్య ప‌రీక్ష‌ల కోసం జూన్ 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన కొత్త మూవీ ‘అన్నాత్తె’ నవంబ‌ర్ 4న విడుద‌ల కానుంది.

ఇది కూడా చదవండి: కరీనా రాసిన ప్రెగ్నెన్సీ బుక్‌కు భారీగా ఆర్డర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement