Sunday, May 5, 2024

Hyderabad: భారీ శబ్దంతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైలు.. పట్టాలపై ప్రయాణికుల పరుగులు

హైద‌రాబాద్ః న‌గ‌రంలో ఎప్పుడు రోడ్ల‌న్నీ ర‌ద్దీగా ఉంటాయి. దీంతో వాహ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ న‌గ‌ర వాసులు మెట్రో లేదా ఎంఎంటీఎస్ రైళ్ల‌లోనే ప్ర‌యాణం చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయ‌సంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తున్నాయి ఈ స‌ర్వీసులు. అయితే నగరంలోని బేగంపేట స్టేషన్ వద్ద ఎంఎంటీఎస్‌ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం బేగంపేట్ వద్ద భారీ శబ్దంతో ఎంఎంటీఎస్ రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా ఆగిపోవడంతో ట్రైన్ కుదుపుకు గురైంది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సాంకేతిక సమస్య వల్లే ట్రైన్ నిలిచిపోయిందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement