Saturday, April 27, 2024

Hyderabad | జీ20 భేటీకి సన్నద్ధం.. ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్కోవాలే: డీజీపీ అంజనీకుమార్​

జనవరి 28 నుంచి జూన్ 17 వరకు హైదరాబాద్​లో జరిగే ప్రతిష్టాత్మకమైన జి-20 కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ఏర్పాటైన జి-20 భద్రతా సమన్వయ కమిటీ సమావేశం ఇవ్వాల (మంగళవారం) తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జరిగింది. డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, NDRF, SRDF, CISF, NSG, ఇతర భద్రతా సంబంధిత విభాగాల అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందిని కవర్ చేయడంతో పాటు, ప్రపంచ జీడీపీలో 85శాతం, 75శాతం వాటా కలిగిన 29 దేశాలు సభ్యులుగా ఉన్నాయని, జి-20 దేశాల అధినేతల సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్​లో ఉండనుంది. ప్రపంచ వాణిజ్యం, ప్రధానమంత్రి నేతృత్వంలో సెప్టెంబర్​లో ఉంటుందని డీజీపీ తెలిపారు. 

కాగా, ఈ సదస్సుకు ముందు దేశంలోని 56 నగరాల్లో 215 కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ అంజనీకుమార్​ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆరు జి-20 సమావేశాలు జరగనున్నాయి. మొదటి సమావేశం జనవరి 28న జరగనుండగా, మార్చి (6, 7), ఏప్రిల్ (26, 27,28), జూన్ (7, 8, 9, 15, 16, 17)లలో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి..

ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ జీ-20 సమావేశాలను సజావుగా.. ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ తెలిపారు.

- Advertisement -

జీ-20 సమావేశాలకు హాజరయ్యే ఉన్నత స్థాయి ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని డీజీపీ ఆదేశించారు. ప్రధానంగా విమానాశ్రయం, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశ ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను అంజనీకుమార్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement