Friday, April 26, 2024

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు: 75 పేజీల చార్జ్‌షీట్‌ను సిద్ధం

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 75 పేజీల చార్జ్‌షీట్‌ను సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరి 5న ప్రవీణ్ రావ్  సోదరులను  భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ అనుచరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఐటి అధికారుల పేరు  చెప్పి ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురిని  అఖిల ప్రియ దంపతుల అనుచరులు కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి  అఖిల ప్రియ దంపతులతో పాటు 30 మందిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నెల రోజుల్లో పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: ఈట‌ల కోసం కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థి: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement