Sunday, May 5, 2024

హైదరాబాద్‌ బుక్​ ఫెయిర్‌.. రచయితల పుస్తకాల ప్రదర్శనకు చాన్స్​

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : డిసెంబర్‌ 22వ తేది నుండి తెలంగాణ కళాభారతి ప్రాంగణం (ఎన్టీఆర్‌ స్టేడియం)లో జరగబోయే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ లో రచయితల పుస్తకాల ప్రదర్శన, అమ్మకాలను జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నామని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. ఉత్సాహపడే రచయితలు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

బుక్‌ ఫెయిర్‌ నిబంధనలకు లోబడి ప్రతి రచయిత వారి రచనలలోని ఐదింటిని, ఐదు కాపీలు చొప్పున ప్రదర్శనకు ఉంచవచ్చన్నారు. ఒకటి నుండి 10 -టైటిల్స్‌ వున్న రచయితలకు ప్రత్యేకంగా ఒక టేబుల్‌ కేటాయిస్తామన్నారు. అందుకు ప్రత్యేక రుసుము ఉంటు-ందన్నారు. వీరికి స్ట్రాల్ర్‌ కేటాయించలేమని, డిసెంబర్‌ 17వ తేదిలోపు సంప్రదించి పుస్తకాలు పంపాలని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement