Tuesday, April 30, 2024

మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు..

మారుతీ సుజుకీ ఇండియా హోలీని పురస్కరించుకుని భారీ ఆఫర్లును ప్రకటించింది. కొత్తగా కారును కొనుగోలు చేసే వినియోగదారులకు భారీ తగ్గింపులను అందించనున్నట్లు తెలిపింది. మారుతీ నెక్సా రేంజ్‌పై రూ.10వేలు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌తోపాటు రూ.2వేలు కార్పొరేట్‌ బోనస్‌ అందించనుంది. కారు మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.20వేలు తగ్గించనుంది. మారుతీ సియాజ్‌ మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.10వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది.

సెడాన్‌కు సంబంధించి అన్ని వేరియంట్లపై రూ.25వేలు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.5వేలు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ను ప్రకటించింది. మారుతి సుజుకి ఎస్‌-క్రాస్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ కారు రూ.15వేలు (సిగ్మా, డెల్టా, అల్ఫాట్రిమ్‌లపై) తగ్గింపుతో అందించనున్నారు. జీటా ట్రిమ్‌పై రూ.20వేల క్యాష్‌ డిస్కౌంట్‌ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement