Thursday, May 16, 2024

యూజీ విద్యార్థుల‌కే హాస్ట‌ల్‌.. మంత్రి స‌బిత చ‌ర్చ‌లు స‌ఫ‌లం, శాంతించిన స్టూడెంట్స్‌

నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, నిజాం కళాశాల విద్యార్థినులతో భేటీ అయ్యారు. నిజాం కళాశాల విద్యార్థినుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని మంత్రి కె. టి. రామారావు సూచన మేరకు ఈ సమావేశాన్ని నిర్వ‌హించిన‌ట్టు సబితా తెలిపారు.

మార్గదర్శక నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలని అధికారులను మంత్రి స‌బితా ఆదేశించారు. విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యుజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. దీంతో ఇన్ని రోజులుగా ఆందోళ‌న చేస్తున్న విద్యార్థినుల స‌మ‌స్యకు ప‌రిష్కారం దొరికిన‌ట్ట‌య్యింది. మంత్రితో జ‌రిపిన చర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో స్టూడెంట్స్ శాంతించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement