Friday, April 26, 2024

ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు కౌశిక్..

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి హిమాన్షు కౌశిక్ బాధ్యతలు స్వీకరించారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు కౌశిక్ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రైనీ ఐఏఎస్‌గా, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సబ్-కలెక్టర్‌గా, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా విధులు నిర్వహించారు.

విధినిర్వహణలో ఉన్నతాధికారుల నుంచి పలు సందర్భాల్లో ప్రశంసలు పొందిన హిమాన్షు కౌశిక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో అదనపు రెసిడెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహించనున్నారు. బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏపీ భవన్ అధికారులు, సిబ్బందితో పాటు ఢిల్లీలో పలువురు తెలుగువారు ఆయన్ను కలిసి అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement