Thursday, May 2, 2024

Breaking : హిజాబ్ వివాదం : క‌ర్ణాట‌క‌లో 144 సెక్ష‌న్ అమ‌లు

హిజాబ్ వివాదం కర్ణాటకను ఊపేసింది. నేడు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు నివ్వనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక అంతటా ప్రభుత్వం 144వ సెక్షన్ అమలు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. హిజాబ్ వివాదం ఎక్కువగా ఉన్న దక్షిణ కర్ణాటకలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవును ప్రకటించింది. అనేక విద్యాసంస్థల్లో హిజాబ్ వివాదం తలెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. పాఠశాలలు, కళాశాలల్లో డ్రెస్ కోడ్ పాటించాలని పేర్కొంది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం ఇరు వర్గాల విచారణను వినింది. నేడు తీర్పు రానున్న‌ నేపథ్యంలో కర్ణాటక అంతటా 144వ సెక్షన్ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement