Friday, April 26, 2024

Breaking : విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాదు – హై కోర్టు తీర్పు

హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు తీర్పునిచ్చింది. విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ముస్లీం విద్యార్థుల‌కు అనుగుణంగా హైకోర్టు తీర్పునివ్వ‌డం వారికి ఊర‌ట‌ని క‌లిగించింది.హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఈ మేర‌కు విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ యూనిఫాంను ధరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరో వైపు యూనిఫామ్ పై విద్యార్ధులు అభ్యంతరం చెప్పకూడదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. హిజాబ్ వివాదం నేపథ్యంలో గత మాసంలో హిజాబ్ తో పాటు, కాషాయ రంగు కండువాలు ధరించి విద్యా సంస్థలకు రావడంపై నిషేధం విధించింది. విద్యా సంస్థల్లోకి హిజాబ్ వేసుకొని రావడంపై వివాదం చేలరేగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. హిజాబ్ ధరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ సుమారు 12 మంది ముస్లిం విద్యార్ధులతో పాటు పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై 11 రోజుల విచారణ అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ విషయమై హైకోర్టు తన తుది తీర్పును వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement