Wednesday, May 8, 2024

ఓంరౌత్ తో క‌లిసి రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న -హీరో ప్ర‌భాస్

విల్లుని ఎక్కుపెట్టారు స్టార్ హీరో ప్ర‌భాస్.అయితే ఇది సినిమాకోసం కాదండీ..రియ‌ల్ గానే జ‌రిగింది. రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం ల‌వ్ కుశ్ రామ్ లీలా మైదానంలో జ‌రిగింది.ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు రామ్ లీలా క‌మిటీ అధ్య‌క్షుడు అర్జున్ కుమార్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మ‌న సంస్కృతి ప‌ట్ల ప్ర‌భాస్‌కు ఉన్న అంకిత భావాన్ని చూసే ఆయ‌న్ని ఇక్క‌డ‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించామ‌ని అన్నారు.ప్ర‌భాస్. కాగా ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారితో ఫొటోలు దిగ‌టంతో పాటు.. వారిచ్చిన కానుక‌ల‌ను స్వీక‌రించారు. విల్లు ఎక్కు పెట్టి బాణాన్ని సంధించి రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం చేశారు. దర్శ‌కుడు ఓం రౌత్ తో క‌లిసి అక్క‌డు రామ ల‌క్ష్మ‌ణులు, ఆంజ‌నేయుడు వేషం వేసుకున్న న‌టీన‌టుల‌కు హార‌తి ఇచ్చారు ప్ర‌భాస్‌.ప్ర‌భాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్నారు రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌టంతో ఆయ‌న‌కు ఉత్త‌రాదిన క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది. రీసెంట్‌గానే ఆది పురుష్ టీజ‌ర్ ను రామ జ‌న్మ‌భూమి అయిన అయోధ్య‌లో భారీ ఎత్తున విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement