Tuesday, May 14, 2024

సాగర్ సమీపంలో కూలిన హెలికాప్టర్

జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్‌ మంగళవారం ఉదయం కూలిపోయింది. కథువా జిల్లాలోని రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌ సమీపంలో హెలికాప్టర్‌ కూలిపోగా.. సహాయక చర్యల కోసం అధికారులు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపారు. 254 ఆర్మీ ఏవియేషన్‌ స్కాడ్రన్ హెలికాప్టర్‌ మామున్‌కాంట్‌ నుంచి ఉదయం 10.20 గంటలకు బయలుదేరింది. డ్యామ్‌ ప్రాంతంలో తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరగా.. గజ ఈతగాళ్లను సైతం రప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement