Sunday, April 28, 2024

TS : పశ్చిమ బెంగాల్‌లో భారీ తుఫాన్​…

ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను, వర్షం కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ప్రధానంగా జల్‌పైగురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది.

ఈ తుఫాను ధాటికి అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో రాజర్‌హట్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత చెందగా, 500 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

ఈ తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి. రాజర్‌హత్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాలు ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తుపాను వార్తలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీకూడా విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ లో ఒక పోస్ట్ కూడా చేశారు. తన పోస్ట్‌లో, ‘ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం, ఈదురు గాలులు జల్‌పైగురి-మైనాగురిలోని కొన్ని ప్రాంతాలలో విపత్తును కలిగించాయని తెలుసుకోవడం విచారకరం. ఇందులో ప్రాణ నష్టం జరిగింది. అనేక మంది గాయపడ్డారు, ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు మొదలైనవి నేలకొరిగాయి. జిల్లా, బ్లాక్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు, డీఎంజీ, క్యూఆర్‌టీ బృందాలు విపత్తు నిర్వహణ కార్యకలాపాలలో పాల్గొని సహాయాన్ని అందిస్తున్నాయి.

బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరణిస్తే కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు జిల్లా యంత్రాంగం నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తుంది. నేను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాను. జిల్లా యంత్రాంగం రెస్క్యూ , రిలీఫ్ అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని కచ్చితంగా అనుకుంటున్నాను.” అంటూ ట్విటర్‌ లో పేర్కొన్నారు.

మృతులను సేన్‌పరా నివాసి దిజేంద్ర నారాయణ్ సర్కార్ (52), పహర్‌పూర్‌లో నివాసి అనిమా బర్మన్ (45), పుతిమరి నివాసి జగన్ రాయ్ (72), రాజర్హత్ నివాలీ సమర్ రాయ్ (64)గా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గాయపడిన పలువురు ఆసుపత్రిలో చేరినట్లు ధూప్‌గురి ఎమ్మెల్యే నిర్మల్ చంద్ర రాయ్ తెలిపారు. ఈ తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను కలిసేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తక్షణమే జల్పాయిగురికి బయల్దేరారు. బాధిత ప్రజలను కలిసిన ఆమె.. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని కూడా పరిశీలిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement