Saturday, April 27, 2024

వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు- వెల్లడించింది. ఈ నెల 25,26,27 తేదీల్లో మరోసారి వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ద్రోణి ప్రభావంతో రాయలసీమ నుంచి తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ మీదుగా దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలకు రైతలు తీవ్రంగా నష్టపోయారు. వేల సంఖ్యలో పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మరోసారి వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement