Tuesday, April 30, 2024

వ‌రి ధాన్యం కొనుగోలు డిమాండ్ – రేపు గండి మైసమ్మ లో ధర్నా

కుత్బుల్లాపూర్ ప్రభ న్యూస్ : వచ్చే యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో గండిమైసమ్మ లో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .. తెరాస పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాకు పిలుపునిచ్చిన నేపధ్యంలో.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గారి ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement