Tuesday, May 21, 2024

నిఘా నీడ‌లో క‌న్నాయిగూడెం

ములుగు జిల్లా క‌న్నాయిగూడెంను నిరంత‌రం నిఘా నీడ‌లో ఉంచి ఎలాంటి అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు, అసాంఘీక కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని ఎస్సై వి. చ‌ర‌న్ కుమార్ అన్నారు. గురువారం ఆయ‌న స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సైగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్ లపై ప్రత్యేక నిఘాతో పాటు,మైనర్లు వాహనాలు నడిపితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు మద్యం అక్రమ రవాణా, ఇసుక, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు చోరీల నివారణకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు శాంతిభద్రతల పరిరక్షణకు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement