Friday, April 26, 2024

సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. టీఎస్‌ఆర్టీసీలో 10శాతం రాయితీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్‌ బస్సుల్లో అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉం టుందని స్పష్టం చేసింది.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జన్నార్‌ తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలనీ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. రిజర్వేషన్‌ కోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement