Friday, April 26, 2024

పెరిగిన బంగారం ధరలు.. బంగారం బాటలోనే వెండి

ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అందుకే మన దేశంలో బంగారానికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కానీ ఈ కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా పెరిగాయి.

ఆదివారం నాడు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 44,500 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48,550 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1,600 పెరిగి రూ. 65,200 పలుకుతుంది.

ఈ వార్త కూడా చదవండి: జియో స్మార్ట్ ఫోన్ ధర లీక్… రూ.500కే ఫోన్

Advertisement

తాజా వార్తలు

Advertisement