Saturday, April 20, 2024

దంపతుల మధ్య వివాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

దంపతుల మధ్య వివాదం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాలను బలిగొంది. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేటకు చెందిన బ్రహ్మానందం, రాజమణి కుటుంబం కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో ఉంటోంది. వీరికి ప్రియాంక (28) అనే కుమార్తే ఉంది. గతేడాది నవంబర్‌లో హన్మకొండకు చెందిన మందుగుల అన్వేష్‌తో వివాహం చేశారు. దంపతులిద్దరూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే కావడంతో ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌లోనే ఉంటూ.. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ చేస్తున్నారు.

అయితే ఇటీవల దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఊరికివెళ్లే విషయంలో తాజాగా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. శుక్రవారం భార్యను హన్మకొండకు రావాల్సిందిగా అన్వేష్‌ భార్యను కోరాడు. అయితే దానికి ప్రియాంక రాను చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. తర్వాత ఇద్దరూ చేరో గదిలో నిద్రపోయారు. ఉదయం లేచి చూసేరికి ప్రియాంక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియాంక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు అన్వేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement