Wednesday, May 15, 2024

Delhi | ఏఐసీసీ ఓబీసీ ఛైర్మన్‌తో గిడుగు భేటీ.. ఓబీసీ కులగణనపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో కులగణన జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్ అజయ్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ అంశంపై చర్చించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశవ్యాప్త కులగణనతో పాటు తొలుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

మరోవైపు బిహార్ రాష్ట్రం కులగణన జరిపి, ఆ వివరాలు వెల్లడించి మిగతా రాష్ట్రాలు, పార్టీల కంటే ఒకడుగు ముందే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయిలో కులగణన జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలపై ఓబీసీ సెల్ ఛైర్మన్‌తో చర్చించినట్టు అనంతరం మీడియాకు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement