Friday, May 17, 2024

TS | కాంగ్రెస్​ పార్టీలో చేరిన బీఆర్​ఎస్​ ఎల్​బీనగర్ ఇన్​చార్జి రామ్మోహన్​గౌడ్​!

కాంగ్రెస్​ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్​లోని ఎల్​బీనగర్​ నియోజకవర్గం నుంచి ఇవ్వాల (గురువారం) సాయంత్రం బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన కీలక నేత, నియోజవకర్గ ఇన్​చార్జి ముద్దగౌని రామ్మోహన్​గౌడ్​ కాంగ్రెస్​లో చేరారు. గాంధీ భవన్​లో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఇక.. ఆయన సతీమణి బీఎన్​రెడ్డినగర్​ డివిజన్​ మాజీ కార్పొరేటర్​ లక్ష్మీ ప్రసన్న కూడా రామ్మోహన్​గౌడ్​తో పాటు కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

కాగా, గురువారం ఉదయం బి.ఎన్.రెడ్డి నగర్ లోని త‌న నివాసంలో రామ్మోహన్ గౌడ్ ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్నాక కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement