Sunday, April 28, 2024

PM | ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని.. ఆది కైలాస పర్వతం, పార్వతి కుండ్ లో ధ్యానం!

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం పార్వతీ కుండ్ ను సంప్రదాయ దుస్తులు ధరించి దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆదికైలాస పర్వతానికి ఎదురుగా కూర్చుని.. గంటన్నర పాటు ధ్యానం చేశారు. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పితోర్ ఘర్‌లోని శివపార్వతి ఆలయాన్ని కూడా సందర్శించారు.

కైలాసపర్వతం వద్ద శివపార్వతుల ఆలయం ముందున్న శివలింగానికి పూజలు చేశారు. మోదీ వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు. పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతీ కుండ్ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇక్కడి నుంచి ఆది కైలాస దర్శనంతో మనస్సులొ ప్రశాంతత నెలకొన్నదన్నారు. దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థించినట్టు మోదీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement