Monday, May 20, 2024

రూ.2కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌..3కార్లు సీజ్

అంత‌రాష్ట్ర ముఠా గుట్టు ర‌ట్ట‌యింది. స‌మాచారం మేర‌కు రాచ‌కొండ ఎస్ వోటీ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 1,240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి నుంచి 3 కార్లను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. విశాఖపట్నం సమీపంలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement