Sunday, May 12, 2024

అవునా….వాట్సాప్ మొన్న ఆగటానికి కారణం మోడీనా !!

రాజకీయ పార్టీల నాయకులు ఏమోగానీ… ఆ కింద ఉన్న కార్యకర్తల హడావిడి మాత్రం మామూలుగా ఉండదు. తమ పార్టీ నాయకులను పేకమేడలు కట్టేసి మరి పైకి లేపుతారు. మొన్న రాత్రి వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ఓ గంటపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై బీజేపీ కార్యకర్తలు ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా…!!

రోజంతా వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వంటి యాప్స్ వాడడం వల్ల దేశంలో రేడియేషన్ లెవెల్స్ ఒక్కసారిగా పరిమితికి మించిపోయాయి.దీనితో ఒక్కసారిగా కేంద్రం అత్యవసర పరిస్తితి ఎదురుకుంది.ఆఘమేఘాలమీద మార్క్ జూకర్ బర్గ్ తో మోడీ గారు చర్చించి ఆపించి వేశారు.అలా కాసేపటికి ఓజోన్ మళ్ళీ సర్దుకుంది. అందుకే సమయస్ఫూర్తి అవసరం అంటారు.. ఏదైనా మోడీ గారు వల్లే ఇలా ఉన్నాం మనం అంటూ ఆ కార్యకర్తలు చేసుకున్న చాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement