Tuesday, April 30, 2024

చంద్రబాబు మొండిగా ముందుకెళ్లారు!

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పంచాయతీ ఎన్నికలు, టీడీపీలో చేరికతోపాటు సొంత పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తాను చంద్రబాబుకు ఎంతచెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అన్ని రకాలుగా టీడీపీని అడ్డుకొని పంచాయతీలను సొంతం చేసుకుంటారని హెచ్చరించినా.. చంద్రబాబు మొండిగా ముందుకెళ్లారని జేసీ వ్యాఖ్యానించారు.

అంతేకాదు, చంద్రబాబుపై కేసులు నమోదు చేయడం ఆలస్యమైంన్నారు జేసీ. ఇంత లేట్ అవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. సీఎం జగన్ కు తాను ప్రధమ శత్రువును కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. వైఎస్ జగన్, చంద్రబాబుల్లో ఎవరు బెటర్ అని ఆలోచించుకొని విధిలోని పరిస్థితుల్లోనే టీడీపీలో చేరినట్లు చెప్పారు. అయితే, చంద్రబాబు విజన్ ఉన్న నేత అని, అందుకే ఆయనంటే తనకు అభిమానమని తెలిపారు. ఇప్పుడు జేసీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement