Saturday, April 27, 2024

గంగానదిలో ప‌డ‌వ బోల్తా – న‌లుగురు మృతి.. 20 మంది గ‌ల్లంతు

ప‌ట్నా – ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లా లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో గంగా నదిలో వెళ్తున్న పడవ మల్దేపూర్‌ గంగా ఘాట్ సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 20 మంది గ‌ల్లంత‌య్యారు.. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన కొందరిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గల్లంతైన వారి కోసం గ‌జఈత గాళ్లు గాలిస్తున్నారు.. . ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికుల్ని ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement