Thursday, April 25, 2024

గొల్ల,యాద‌వులు ఆగ్ర‌హం – రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల‌కు పేడ‌తో స‌త్కారం

నాగర్‌కర్నూల్ – తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఫ్లెక్సీల‌పై పేడను కొట్టారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్ కు, ఆయన పార్టీకి బుద్ధి చెపుతామని హెచ్చరించారు. పేడ పిసుక్కుని బతికిన తలసాని నా గురించి మాట్లాడతాడా? అంటూ ఇటీవల రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ జాతులను అవమానించారంటూ గొల్ల కురుమలు, యాదవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement