Sunday, April 28, 2024

ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ అరెస్ట్‌.. నాలుగురోజులపాటు ఈడీ కస్టడీకి..

న్యూఢిల్లి:నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సీఈఓ చిత్రా రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ గురువారంనాడు అరెస్టు చేసింది. ఆర్థిక వ్యవహారాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకున్నారన్న కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నాలుగురోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) ప్రకారం ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండే, రవి నరేన్‌తోపాటు చిత్రా రామకృష్ణపై క్రిమినల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఒక బిజినెస్‌ జర్నలిస్టు కార్యకలాపాలు, లావాదేవీలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement