Monday, May 20, 2024

Breaking: సింగ‌ర్ సిద్దూ మూసేవాలాపై ఫైరింగ్‌.. అక్కడికక్కడే కుప్పకూలిన కాంగ్రెస్​ లీడర్​

పంజాబ్‌లో సింగ‌ర్ సిద్దూపై కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఇతను కాంగ్రెస్​ పార్టీ లీడర్​గా కూడా ఉన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌లో సిద్దూ అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలాడు. ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు సిద్దూపై అటాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇవ్వాల పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జవహర్కే గ్రామంలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాతో సహా 424 మంది భద్రతను పంజాబ్ పోలీసులు ఉపసంహరించుకున్న మ‌రునాడే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement