Saturday, May 4, 2024

క‌రీంన‌గ‌ర్ రానున్న మంత్రి కేటీఆర్‌.. రైతు అవ‌గాహ‌న స‌దస్సుకు హాజ‌రు..

తెలంగాణ మంత్రి కే. తారక రామారావు సోమవారం కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. వానాకాలం పంటలపై ఏర్పాటు చేసే అవగాహన సదస్సులో పాల్గొంటారు. ఉదయం ప్ర‌త్యేక హెలికాఫ్టర్ ద్వారా కరీంనగర్ కు చేరుకొని ఉదయం 10-30 గంటలకు కరీంనగర్ బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతారు. కరీంనగర్- రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతు సదస్సులో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో కలసి పాల్గొంటారు. కరీంనగర్ నుండి హెలికాఫ్టర్ లో జగిత్యాలకు చేరుకొని మధ్యాహ్నం 1-30 గంటకు జగిత్యాల- పెద్దపల్లి జిల్లాల వానాకాలం అవగాహన సదస్సులో పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement