Tuesday, May 14, 2024

INS విక్రమాధిత్యలో అగ్నిప్రమాదం..

భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. కర్వార్‌లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఈ యుద్ధ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే ప్రతి స్పందించిన క్రూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేవీ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఈ విమాన వాహక నౌకను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇండియన్ నేవీలో ఇదే అతి పెద్ద షిప్ కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement