Monday, May 20, 2024

Fire: ప‌టాకుల దుకాణంలో ఫైర్‌… ఐదుగురి సజీవదహనం

త‌మిళనాడులోని ప‌టాకుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభ‌వించింది. తాజాగా కల్లకురిచ్చి జిల్లా శంకరాపురంలోని ఓ ప‌టాకుల‌ హోల్ సేల్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా, ఐదుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.

మరో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కల్లకురిచ్చి ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. మంటలు ఆ దుకాణం పక్కనే ఉన్న ఇతర షాపుల‌కూ వ్యాపించాయి. దీపావళి నేపథ్యంలో ప్రజలు ప‌టాకులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement