Thursday, May 2, 2024

ఉత్సాహం హద్దు మీరింది…తెలంగాణ భవన్ లో మంటలు

తెలంగాణ భవన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస పార్టీ అభ్యర్థి వాణి దేవి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ లో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ స్వీట్లు తినిపించుకున్నారు డ్యాన్సులు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. కాగా ఆ సమయంలో కొన్ని నిప్పురవ్వలు తెలంగాణ భవన్ పై పడ్డాయి. దీంతో మొత్తం పైకప్పు కాలిపోయింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement