Friday, May 3, 2024

బండి ఆస్తులపై అధిష్టానం ఆరా…!!

బండి సంజయ్ ఆస్తులు 600 కోట్లు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అలర్ట్ అయింది. నిప్పు లేనిదే పొగ రాదంటూ సోషల్ మీడియాలో వచ్చిన
వార్తల పట్ల ఢిల్లీ పెద్దలు బండి ఆస్తులపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. బండి సంజయ్ అక్రమాస్తుల ఆరోపణలకు ఊతమిస్తు గ్రానైట్ స్కాం కి సంబంధించిన ఆడియో టేపులు బయటపడినట్లు సమాచారం. సంవత్సరం క్రితం గ్రానైట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిన విషయంలో వారి నుండి 45 కోట్లు తీసుకున్నట్లు కొన్ని వీడియో టేపులు కొందరి నాయకుల దగ్గర ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాకముందు సంజయ్ ఆస్తులు, వ్యాపారాలు ఏంటి….ఇప్పుడున్న వ్యాపారాలు ఏంటి అనేది బిజెపి అధిష్టాన పెద్దలు కూడా ఆరా తీసుకున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఈ విషయమై కింది స్థాయి కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలోనే బండి ఆస్తులు 600 కోట్లని ప్రముఖ దినపత్రికలో వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ కావడం పార్టీ వర్గాల్లో, కార్యకర్తలలో బండి సంజయ్ఆస్తుల గురించి విపరీతంగా చర్చ జరిగింది. ఇందులో కొంత నిజముంది అని స్వయంగా బిజెపి కార్యకర్తలే అనుకుంటుండటంతో ఇదే విషయాన్ని కొందరు రాష్ట్ర బిజెపి సీనియర్ నేతలు వెంటనే ఢిల్లీ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధిష్టానం సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే డిల్లీ పిలుపు ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement